ఇంజిన్ను ధ్వంసం చేసిన దుండగులు
ప్రజాశక్తి - ఆదోని
పంటకు సాగునీరందించేందుకు ఏర్పాటు చేసిన ఆయిల్ ఇంజిన్ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని బాధితులు శుక్రవారం వాపోయారు. ఆదోని పట్టణం పర్వతాపురంలో పంట పొలాలకు నీరందించే ఇంజిన్ను ధ్వంసం చేయడంతో బాధితులు వాపోయారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని రైతు సుజాతమ్మ కోరారు. వర్షాల్లేక పంటలు ఎండిపోతుంటే నీళ్లు కట్టుకునేందుకు ఇంజిన్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రాత్రి ఒంటిగంట సమయంలో ధ్వంసం చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు.