Aug 06,2021 06:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంటు అవార్డును తీసుకోరాదని నిర్ణయించినట్టు ప్రజాశక్తి పూర్వ సంపాదకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. 'పత్రికారంగంలో నాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును తీసుకోరాదని నిర్ణయించుకున్నాను. ఈ నాడున్న వివాదాస్పద రాజకీయ మీడియా సోషల్‌ మీడియా వాతావరణంలో ఈ అవార్డును స్వీకరించడం లేదని తెలియజేస్తున్నాను. ఈ పురస్కార ప్రకటన ద్వారా నా పట్ల్ల గౌరవాదరణ ప్రదర్శించిన ప్రభుత్వం, కమిటీ మిత్రులకు, అభినందనలు తెల్పిన ఎందరో స్నేహితులు, శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు.' అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.