Aug 29,2022 00:53

ఆవులచక్రపాణి యాదవ్‌

ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ : తెలుగురాష్ట్రాల్లో ఖ్యాతిచెందిన ప్రముఖ కళా సాహితీసంస్థ లలితకళాసమితి కర్నూలు వారు ఈ ఏడాది తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా తెలుగు భాషా సేవా పురస్కారాలను ప్రకటించారు. ఈ పురస్కారాల్లో భాగంగా కర్నూలు సాహితీస్రవంతి నగర కమిటి ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కవి ఆవులచక్రపాణి యాదవ్‌కు గిడుగురామ్మూర్తి తెలుగుభాషా సేవా పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన కవులు ఎస్‌ఎస్‌. పటేల్‌, చౌశా, కల్యాణదుర్గం స్వర్ణలత, సయ్యద్‌ జహీర్‌ అహ్మద్‌లు ఉన్నారు. ఆగస్టు 29 సోమవారం సాయంత్రం లలితకళాసమితిలో జరిగే ప్రత్యేక భాషాసంబరాల్లో సత్కారం పొందనున్నట్లు అధ్యక్షులు పత్తిఓబులయ్య తెలిపారు.