Aug 07,2021 08:49

కడప : కడప జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరు-బద్వేలు జాతీయ రహదారి రక్తమోడింది. డి.అగ్రహారం వద్ద ఇన్నోవా, మినీ లారీ ఎదురెదురుగా ఢకొీన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి ఏడుగురు వ్యక్తులు కడపలో జరుగుతున్న వివాహానికి ఇన్నోవాలో బయలు దేరారు. మరోవైపు చిత్తూరు నుండి టమాటా లోడుతో మినీ లారీ వస్తోంది. డి అగ్రహారం వద్ద స్పీడ్‌ బ్రేకర్ల కారణంగా ఇన్నోవా, లారీ ఎదురెదురుగా ఢకొీని ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను, మృతదేహాలను బద్వేల్‌ ప్రభుత్వానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు.