ప్రజాశక్తి - చిప్పగిరి
ఆరోగ్యశ్రీ కార్డు పొందిన ప్రతి కుటుంబ వివరాలను ఆరోగ్యశ్రీ యాప్లో వంద శాతం నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శి బాలన్న, సచివాలయ ఎఎన్ఎం సువర్ణ వాలంటీర్లకు సూచించారు. శుక్రవారం నేమకల్లు సచివాలయ కార్యాలయంలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి బాలన్న మాట్లాడారు. కలెక్టర్ సీరియస్గా ఉన్నారని, ఆరోగ్యశ్రీ కార్డు పొందిన వారి వివరాలను యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. నిర్దేశించిన పనులను నిర్వర్తించకపోతే ఎలా అని మండిపడ్డారు. సచివాలయ అధికారులు పాల్గొన్నారు.
పని చేయని వాలంటీర్లకు తొలగింపు నోటీసులు
నేమకల్లు పంచాయతీలో 23 మంది వాలంటీర్లు ఉండగా, నలుగురు వాలంటీర్లు ఉన్నతాధికారులు నిర్దేశించిన విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడంతో ఎంపిడిఒ సివి.కొండయ్య ఆదేశాలతో తొలగింపు నోటీసులను అందజేసినట్లు పంచాయతీ కార్యదర్శి బాలన్న తెలిపారు.
వాలంటీర్లతో మాట్లాడుతున్న పంచాయతీ కార్యదర్శి బాలన్న