Aug 12,2023 00:08

పల్నాడు జిల్లా: ఈ నెలలో జిల్లా పరి థిలో జరగనున్న ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ ర్యాలీ ఏర్పాట్లను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ బుధవారం పరిశీలిం చారు. నరసరవుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్డులో గల జిల్లా క్రీడా ప్రాం గణంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం యస్‌.యస్‌.ఎన్‌ కళాశాలలోని బాలుర వసతి గృహంలో జరుగుతున్న ఏర్పా ట్లను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ ర్యాలీ కోసం వస్తున్న అభ్యర్థులకు వసతుల కల్పనలో ఇక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.