Sep 04,2023 20:48

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న జెసి ఫర్మన్‌ అహ్మద్‌ఖాన్‌

 రాయచోటి : జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహించారు. కార్య క్రమంలో జెసి ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యన ారాయ ణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సంద ర్భంగా జెసి మాట్లాడుతూ పిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబం ధిత అధి కారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పార దర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంత ప్తిచెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశిం చారు. పెండింగ్‌ దరఖాస్తులు, బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏ, రీఓపెనింగ్‌ లేకుండా అర్జీదారుడు సంతప్తి చెందేలా అర్జీలను పరిష్కరిం చాలన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి జెసి అర్జీలను స్వీకరి ంచారు సంబంధిత అధికారులకు బదిలీ చేశారు.. స్పందన కార్యక్ర మంలో జిల్లా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.