Jan 28,2023 23:20

అప్పన్న సన్నిధిలో రోజా, కల్యాణి

ప్రజాశక్తి-సింహాచలం: సింహాద్రి అప్పన్నను శనివారం రాష్ట్ర మంత్రి ఆర్‌కె.రోజా, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఎఇఒ నరసింహారాజు సాధరంగా స్వాగతం పలికారు. వీరు ముందుగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. స్వామి అంతరాలయంలోనూ, గోదాదేవి సన్నిధిలోనూ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆస్థాన మండపంలో అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు.