అప్పారికి నివాళి అర్పిస్తున్న యుటిఎఫ్ నాయకులు
ప్రజాశక్తి-మేదరమెట్ల: మండలంలోని మేదరమెట్ల గ్రామంలో యుటిఎఫ్ కార్యాల యంలో అప్పారి వెంకటస్వామి 21వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పి. హరిబాబు, యుటిఎఫ్ మండల అధ్యక్షులు కె పోతురాజు, బొనిగల శ్రీనివాసరావు, ఓ శ్రీనివాసరావు, ఎల్ వెంకటేశ్వరరెడ్డి, టీ ప్రసాద్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎం ఆంజనేయులు పాల్గొన్నారు.










