ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రాత్రి పూట నిర్వహించే కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం రాత్రి 10 గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. దీనినే ఆగస్టు 14 వరకూ కొనసాగించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశించారు.