Aug 01,2021 20:00

అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా గత 24గంటల్లో 85,856 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,287 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. 18 మంది చనిపోయారు. మరో 2,430 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,68,462కు, మరణాల సంఖ్య 13,395కు చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటికే 19,34,048 మంది కోలుకున్నారు. ఇంకా 21,019 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 410, చిత్తూరులో 377 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 28, శ్రీకాకుళంలో 45 కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలతో చిత్తూరులో నలుగురు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురేసి, తూర్పుగోదావరి, ప్రకాశంలలో ఇద్దరేసి, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.