Aug 06,2021 17:41

అమరావతి : ఎపిలో గత 24 గంటల్లో 81,505 మంది నమూనాలు పరీక్షించగా.. 2,209 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 438 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 382, నెల్లూరు జిల్లాలో 307, కృష్ణా జిల్లాలో 243 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 27 కేసులను గుర్తించారు. అదే సమయంలో 1,896 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. 22 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే ఆరుగురు బలయ్యారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,490కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,78,350 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 19,44,267 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 20,593 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.