Jul 30,2021 17:41

అమరావతి : రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 80,641 నమూనాలను పరీక్షించగా.. 2,068 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 337 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 315, కృష్ణా జిల్లాలో 251, ప్రకాశం జిల్లాలో 207, నెల్లూరు జిల్లాలో 205 కేసులు బయటపడ్డాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 18 కేసులు గుర్తించారు. అదే పమయంలో 2,127 మంది కరోనా నుంచి కోలుకోగా.. 22 మంది మరణించారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఆరుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,64,117 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 19,29,565 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 21,198 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా మృతులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 13,354కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.