Jul 31,2021 17:22

అమరావతి : రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 78,992 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,058 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 364 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 325, చిత్తూరు జిల్లాలో 284, ప్రకాశం జిల్లాలో 242 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 11 కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,053 మంది కరోనా నుంచి కోలుకోగా.. 23 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,377 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,66,175 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా... 19,31,618 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 21,180 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.