Aug 07,2021 20:45

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 80,376 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1908 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. 23 మంది మరణించారు. మరో 2,103 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 20,375 యాక్టివ్‌ కేసులున్నాయి. శనివారం అత్యధికంగా తూర్పుగోదావరిలో 438, చిత్తూరులో 231 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలులో 26, విజయనగరంలో 29 కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలతో కృష్ణాలో నలుగురు, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరిలో ముగ్గురేసి, అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశంలలో ఇద్దరేసి, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 13,513కు చేరిందని వైద్యారోగ్యశాఖ పేర్కొంది.