Aug 03,2021 17:31

అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 69,606 నమూనాలు పరీక్షించగా.. 1,546 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,71,554 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో కరోనా కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 13,428కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,940 మంది కరోనా నుంచి కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 19,37,956కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,170 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,47,78,146 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.