Aug 04,2021 19:38

అమరావతి : ఎపిలో గడచిన 24 గంటల్లో 85,822 మంది నమూనాలు పరీక్షించగా.. 2,442 పాజిటివ్‌ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 477, చిత్తూరు జిల్లాలో 433, కృష్ణా జిల్లాలో 308, నెల్లూరు జిల్లాలో 248, ప్రకాశం జిల్లాలో 228 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 23 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2,412 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మహమ్మారికి 16 మంది బలయ్యారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 13,444కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,73,996 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 19,40,368 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 20,184 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.