Jul 31,2021 21:04
నేవీ రక్షించిన ఫిషంగ్‌ బోటు ఇదే..

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : అండమాన్‌లోని కార్నికోబార్‌లో సలేత్‌ మాతాా2 అనే ఫిషింగ్‌ బోటును తూర్పునౌకాదళ నేవీ అధికారులు రక్షించారు. ఫిషింగ్‌ బోటులోని గేర్‌ బాక్సులో సాంకేతిక సమస్య తలెత్తడంతో స్పీడ్‌ను కంట్రోల్‌ చేయలేని పరిస్థితిలో నావికాదళానికి సమాచారం అందినట్లు అధికారులు వెల్లడించారు. ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ సహకారంతో ఆ బోటును నియంత్రణలోకి తీసుకున్నారు. సమీపంలోని హార్బర్‌లోకి దాన్ని తోసుకుంటూ ఐరావత్‌ వెళ్లింది. బోటులో చిక్కుకున్న ఏడుగురు క్రూ మెంబర్లను (మత్సకారులు) సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.