Nov 18,2023 22:33

ప్రజాశక్తి-ఉయ్యూరు : అంగన్వాడి కార్యకర్త ముళ్ళపూడి సౌధా రాణి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బి. రాజేష్‌ అన్నారు. సౌదారాణి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శనివారం సిఐటియు నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు ఉయ్యూరు మండల తాహసిల్దార్‌ కే మస్తాన్‌ కు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా రాజేష్‌ మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తలు తమ ప్రాంతాలలో చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు చదువు చెప్పడం బాలబాలికలను క్రమశిక్షణతో తయారు చేయడంలో అంగన్వాడీ వర్కర్లు కీలకపాత్ర వహిస్తున్నారని అన్నారు.గర్భిణీ మహిళలకు పౌష్టికా హారం అందించడం ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సర్వేలు పూర్తి చేయడంలో అంగన్వాడీ కార్యకర్తలు ముందు ఉంటున్నారని అన్నారు.ప్రభుత్వాలు అంగన్వాడీ కార్యకర్తలను చిన్నచూపు చూసి వీరికి కనీస వేతనాలు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఈఎస్‌ఐ వంటి సంక్షేమ ఫలాలు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా చెందారని ఆరోపించారు. సౌదా రాణి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే సహాయం చేసి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ నాయకులు కనకరత్నం ఇందిరా, పద్మ సౌభాగ్యం భారతి పాల్గొన్నారు.