హిందూపురం : అంధత్వ నివారణకు ట్రినిటీ ఆర్గనైెజేషన్, బెంగళూరుకు చెందిన శంకర్ నేంత్రాలయం చేస్తున్న కృషి అభినందనీయం అని సిఅండ్ఐజి మిషన్ చర్చి అధ్యక్ష, కార్యదర్శులు అనిల్కుమార్, పాల్లు తెలిపారు. శనివారం పట్టణంలోని అల్హిలాల్ పాఠశాల ఆవరణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి నెలా రెండవ శనివారం ట్రినిటీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి వారు సౌజన్యంతో కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఉచిత పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు, శస్త్ర చికిత్సలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం 650 మందికి కంటి పరీక్షలు నిర్వహింగా ఇందులో 230 మందికి శస్త్ర చికిత్సకోసం బెంగళూరుకు తరలిచారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ ఆర్గనైజేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కుమార్రాజా, ఉషారాణి, కంటి వైద్య నిపుణులు డా||అనూహ్య, వాలంటీర్లు రహంతుల్లా పాల్గొన్నారు.










