May 13,2023 18:37

సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడంతో పట్టణంలోని పాత బస్టాండ్‌, శ్రీనివాస్‌ భవన్‌ కూడలిలో భారీ ఎత్తున బాణసంచా పేల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జీ దేవిశెట్టి ప్రకాష్‌, జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షులు ఎమ్‌డి.నూర్‌, నీలకంఠప్ప, దిలీప్‌ డొక ఆధ్వర్యంలో కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కర్ణాటకలో గత బిజెపి ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిస్థాయిలో మెజారిటీ ఇచ్చారని తెలిపారు. మైనార్టీ సెల్‌ ఆదోని ఛైర్మన్‌ ఎమ్‌డి.రఫీ, ఉపాధ్యక్షులు హుస్సేన్‌ బాష, జిల్లా ఐఎన్‌టియుసి ఉపాధ్యక్షులు జయరాం, యూత్‌ కాంగ్రెస్‌ బి.తాయన్న, మండల అధ్యక్షులు బి.హనుమంతు, సీనియర్‌ నాయకులు శ్రీధర్‌, దొడ్డంకేరి లక్ష్మన్న, గోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.