Jul 28,2021 19:16
ఆముక్తమాల్యద సుష్మా

ప్రజాశక్తి -తిరుపతి క్యాంపస్ :  శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విభాగంలోని పరిశోధక విద్యార్థి ఎం ఆముక్తమాల్యద సుష్మాకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు.  మహిళా వర్సిటీలోని మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విభాగంలోని  ఆచార్యులు డాక్టర్ ఆర్ ఎన్ ఎస్ శైలేశ్వరి మార్గదర్శకత్వంలో "గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ - ఏ లిరికిస్ట్ కంపోజర్ అండ్ మ్యూజిషియన్: ఏ స్టడీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు హిస్ మ్యూజికల్ ఫామ్స్" అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని వర్సిటీకి సమర్పించినట్లు వెల్లడించారు. ఆముక్తమాల్యద పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలు సమర్పించినట్లు వెల్లడించారు. అనేక జాతీయ అంతర్జాతీయ పరిశోధన  జర్నల్స్ లలో అనేక అంశాలపై వ్యాసాలను ప్రచురించినట్లు వివరించారు. ఆముక్తమాల్యద సుష్మాకు డాక్టరేట్ అవార్డు రావడం పట్ల పలువురు ఆచార్యులు, పరిశోధకులు, స్నేహితులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.