Aug 08,2021 16:11

అమరావతి : అమరావతి రైతుల ఆందోళనలు 600వ రోజుకు చేరిన నేపథ్యంలో ఎపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులకు టిడిపి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల కలను జగన్‌ చెల్లాచెదురు చేశారని ఆరోపించారు. భవిష్యత్‌ను అంధకారం చేస్తున్న జగన్‌పై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. రాజధానిగా అమరావతిని నిండు మనసుతో స్వాగతిస్తున్నానని గతంలో నిండు అసెంబ్లీలో జగన్‌ చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అలాంటిది, అమరావతిని ధ్వంసం చేయడానికి జగన్‌కు మనసెలా ఒప్పిందని నిలదీశారు.