ప్రజాశక్తి - వేటపాలెం
వైసిపి పర్చూరు ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ నివాసంలో వైసిపి చినగంజాం మండల అధ్యక్షునిగా నియమితులైన మున్నం నాగేశ్వరరెడ్డి శనివారం మర్యాద పూర్వకంగా కశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు ఆమంచి వెంకట సుబ్బారావు, పిఎసిఎస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కడకుదురు రామకృష్ణారెడ్డి, సుబ్బారావు చౌదరి, రుద్రమపురం గోవిందు పాల్గొన్నారు.










