ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని పల్లెదొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రసిద్ధి చెందిన గద్దెరాళ్ల మారెమ్మ దేవాలయ పునఃనిర్మాణానికి, ప్రాకార గోడ అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జయరామ్ సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి, గుమ్మనూరు శ్రీనివాసులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం దేవదాయ శాఖ శ్రేయ నిధి నుంచి, దాతల సహకారంతో మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ రూ.1.17 కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచి రంగస్వామి, ఎంపిపి భర్త లుముంబా, వైసిపి మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున, వైసిపి నాయకులు ప్రకభాకర్ రెడ్డి, నారాయణ రెడ్డి, పల్లెదొడ్డి చంద్ర, జెసిఎస్ మండల కన్వీనర్ రాజారెడ్డి పాల్గొన్నారు.
భూమి పూజలో పాల్గొన్న గుమ్మనూరు సోదరులు