Jan 08,2023 23:36

విన్యాసాల్లో విజ్ఞాన విహార్‌ విద్యార్థులు

ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలం గుడిలోవ విజ్ఞాన్‌ విహార్‌ పాఠశాల 43వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు ప్రదర్శించిన పలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన మోటార్‌ సైకిల్‌ విన్యాసాలు, ఫైర్‌ జంపింగ్‌, ట్యూబ్‌ లైట్లు, పిరమిడ్స్‌ విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. అనంతరం జరిగిన వార్షికోత్సవ సభలో నోవస్‌ కన్స్ట్రక్షన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ ధర్మేంద్ర వరదా, విజయనగరం డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, వ్యాపారవేత్త జి.సుభాష్‌చంద్రబోస్‌, విద్యావేత్త ఎ.వేణుగోపాలనాయుడు, పాఠశాల ప్రిన్సిపల్‌ పీవీ నారాయణరావు, పృధ్వీరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.