
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డిసిసి అధ్యక్షులు ఎం.సుధాకర్బాబు
ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ త్వరలో చేపట్టనున్న కన్యాకుమారి టు కాశ్మీర్ పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో అక్టోబర్ 17న ప్రవేశిస్తుందని డిసిసి అధ్యక్షుడు ఎం.సుధాకర్ బాబు ప్రకటించారు. నాలుగు రోజులపాటు కర్నూలు జిల్లాలో ఆయన పాదయాత్ర ఉంటుందన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మోకా గ్రామం నుండి జిల్లాలో నేరుగా ఆలూరు మండలం కురవల్లి గ్రామంలోకి పాదయాత్ర వస్తుందన్నారు. బహిరంగ సభలో కూడా మాట్లాడుతారన్నారు. ఈ పాదయాత్ర విజయవంతానికి కృసి చేయాలన్నారు.కాంగ్రెస్ నాయకులు బతకన్న ,కరుణాకర్, సత్యనారాయణ గుప్తా పాల్గొన్నారు