ప్రజాశక్తి - చింతలపూడి
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు చింతలపూడి సివిల్ సప్లై డిటి జరినా తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడి మండలం పోతునూరు గ్రామంలో ఉన్న మిల్లు వద్ద శుక్రవారం వ్యాన్లో తరలిస్తున్న 6,400 కేజీల రేషన్ బియ్యాని పట్టుకొని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విఆర్ఒ పాల్గొన్నారు.










