క్యాంపు నిర్వహిస్తున్న వైద్యులు
ప్రజాశక్తి - ఆదోని
ఆంధ్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అవోపా ఆధ్వర్యంలో బుధవారం ఆదోనిలోని సతీష్ మెడిక్యూర్ సెంటర్ వద్ద ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు ఆదోని పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వంకదారు శ్రీనాథ్ గుప్తా, మిర్యాల శ్రీధర్ తెలిపారు. అంతకుముందు పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాదాపు 153 మందికి బీపీ, షుగర్, గ్రూపింగ్ మెడికల్ టెస్టులు ఉచితంగా చేశామని వారు తెలిపారు. సభ్యులు ప్రతాప్, ఈరన్న శెట్టి, రఘు, అవోపా మహిళ విభాగం సభ్యులు సంగీత, మమతశ్రీ, బిందు, గీత పాల్గొన్నారు.