మాట్లాడుతున్న గుడిసె ఆది కృష్ణమ్మ
ప్రజాశక్తి - ఆదోని
కరువు కాటకాలకు, వలసలకు చిరునామాగా మారిన ఆదోనిని కరువు మండలంగా ప్రకటించడంపై ఎమ్మెల్యే చొరవ చూపాలని టిడిపి మాజీ ఇన్ఛార్జీ గుడిసె ఆది కృష్ణమ్మ డిమాండ్ చేశారు. గురువారం ఆదోనిలోని మండగిరిలో ఉన్న ఆమె నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదోని మండలాన్ని కరువుగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ప్రతేడాది ఆదోనిపై ఎందుకంతా నిర్లక్ష్యమని ప్రశ్నించారు. వర్షాల్లేక మండలంలో కరువు విలయతాండవం చేస్తోందన్నారు. ఆదోని సబ్ కలెక్టర్, అధికారులు, ప్రజా ప్రతినిధి మేల్కొని ఆదోనిని తీవ్రమైన కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. టిడిపి నాయకులు వడ్డేమాన్ గోపాల్, మురళీ, రాఘవరెడ్డి, సాధిక్ వలీ, బాబురావు, లక్ష్మీకాంత్ రెడ్డి, భరత్ కుమార్, చిరంజీవి ఉన్నారు.