Nov 25,2022 23:48

మాట్లాడుతున్న డైట్‌ వైస్‌ ప్రిన్సిపా ల్‌ సుధాకర్‌

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక జివిఎంసి పిఎన్‌ఎం ఉన్నత పాఠశాలలో 6,7,8 తరగతులు బోధించే తెలుగు ఉపాధ్యాయులకు లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాంపై ప్రభుత్వ డైట్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ సుధాకర్‌ ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, బోధనలో తర్ఫీదు పొందడం ద్వారా విద్యార్థులకు కరికులం అందించవచ్చని సూచించారు. కోవిడ్‌ తదనంతరం విద్యార్థుల అభ్యనల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా అభ్యసన ఉండాలన్నారు. పాఠశాల హెచ్‌ఎం తిరుమల శ్రీదేవి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శాస్త్రి పాల్గొన్నారు.