శంకుస్థాపన చేస్తున్న కార్పొరేటర్ ప్రసాద్
ప్రజాశక్తి -మాధవధార : 50వ వార్డు సాయిరాంనగర్లో రూ.19.50 లక్షలతో నిర్మించనున్న సిసి డ్రెయిన్స్, కల్వర్టులు, రోడ్డు పనులకు వార్డ్ కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ సోమవారం శంకుస్థాపన చేశారు. వార్డు పరిధిలో సమస్యలు తన దృష్టికి తెస్తే వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకంటానన్నారు. కార్యక్రమంలో. ఎఇ కిరణ్, రామారావు, బగాతి విజరు, కృష్ణారావు మాస్టర్, సన్నిబాబు, రాంబాబు, నూకరాజు, శంకరరావు, అప్పలరాజు, దేవుడుబాబు, విజరు ,రాజు, శంకర్, గణేష్, సత్తిబాబు, రాము, జోగారావు, రమణ, దేవి, శివరాం, వేణు, సబ్బవరపు శ్రీను, త్రినాథ్, చిరంజీవి, గ్రామ పెద్దలు, ఏమినిటీస్ కార్యదర్శి విజయ లక్ష్మి, వాలంటీర్స్ పాల్గొన్నారు.










