Mar 01,2023 00:22

అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్‌ ముర్రువాణి నానాజీ

ప్రజాశక్తి -కంచరపాలెం : జివిఎంసి 57వ వార్డు పరిధి సాకేతపురం కొబ్బరితోట ప్రాంతంలో సుమారు రూ.18 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులను అధికారులతో కలిసి కార్పొరేటర్‌ ముర్రువాణి నానాజీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ, వార్డు అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. వార్డులో ఇటీవల చేపట్టి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటు రోడ్లు, కాలువల నిర్మాణం, గెడ్డలలో పూడికతీత పనులు, దోమల నివారణ తదితర అనేక పనులు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి డిప్యూటీ ఇంజినీర్‌ ఏడుకొండలు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ తారా ప్రసన్న, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ గణేష్‌, స్థానికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.