ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను భగవంత్ కేసరి చిత్ర బృందం శనివారం దర్శించుకుంది. హీరోయిన్ శ్రీలీలా ఆమె తల్లి, చిత్ర దర్శకుడు అనిల్ రావీపూడితో పాటు పలువురు చిత్ర బృంద సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించి ప్రసాదాలను అందజేశారు.. శ్రీలీలాతో సెల్ఫీలు దిగడానికి భక్తులు ఎగబడ్డారు.. హీరోయిన్ అందరితో మాట్లాడుతూ ఓపిగ్గా సెల్ఫీలు దిగారు.. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.