
ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు నగరంలో కర్నూలు జిల్లా ఎస్ఎఫ్ఐ 47వ జిల్లా మహాసభలు డిసెంబర్ 2 , 3 తేదీల్లో జరుగనున్నాయని కర్నూలు సిటీ అధ్యక్ష ,కార్యదర్శులు అమర్ , సాయి ఉదయ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ''ఈ మహాసభల్లో విద్యారంగంలోని సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభల్లో చర్చించబోతున్నాం , భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతున్నాం. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు మరుగయ్యాయి. ఏ హాస్టల్లో చూసినా ఇదే పరిస్థితి శిథిలావస్థకు చేరిన గదులు పెంచులూడిపడుతున్నాయి. విరిగిన కిటికీలు తలుపులు, విద్యార్థులను వెక్కిరిస్తున్నాయి. పనిచేయని ఫ్యాన్లు ఉక్కపోత పుట్టిస్తున్నాయి. ఇక టాయిలెట్లు విషయానికి వస్తే మరింత దారుణమైన పరిస్థితి చాలా చోట్ల మరుగుదొడ్లు పనిచేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు'' అని తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.