Sep 17,2023 11:54

ఒడిశా : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సోదరి, ప్రముఖ రచయిత్రి గీతా మెహతా (80) శనివారం కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఆమె న్యూఢిల్లీలోని స్వగృహంలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నారు. ఆమె భర్త, ప్రముఖ పబ్లిషర్‌ సోని మెహతా 2019లోనే మరణించారు. గీతా మెహతా మఅతి పట్ల ప్రధాని నరేంద్ర మోడి సంతాపం వ్యక్తం చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, గీతా కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.

ప్రముఖ రచయిత్రి, లఘుచిత్ర నిర్మాత, జర్నలిస్టుగా గీతా మెహతా సుపరిచితురాలు. 1943లో బిజూ పట్నాయక్‌, జ్ఞాన్‌ పట్నాయక్‌ దంపతులకు ఆమె జన్మించారు. ఆమె తండ్రి బిజూ పట్నాయక్‌ ఒడిశాకు ముఖ్యమంత్రిగా చేసిన విషయం తెలిసిందే. ఆమె ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు, ప్రేమ్‌ పట్నాయక్‌కు సొంత అక్క. ఆమె 'కర్మా కోలా', 'స్నేక్‌ అండ్‌ ల్యాడర్స్‌', 'ఏ రివర్‌ సూత్ర', 'రాజ్‌', 'ది ఎటర్నల్‌ గణేష' పుస్తకాలను రాశారు. ఆమె తన సోదరుడు నవీన్‌ పట్నాయక్‌ అంటే ఆమెకు అమితమైన ప్రేమ. ఇటీవల భువనేశ్వర్‌ను సందర్శించినప్పుడు మాట్లాడుతూ..''నవీన్‌ పట్నాయక్‌ వంటి సిఎం లభించడం ఒడిశా ప్రజల అదఅష్టం'' అని అన్నారు.