Nov 20,2023 18:11

ప్రజాశక్తి -కలకడ(అన్నమయ్య) : వారం రోజులుగా జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు సోమవారంతో ముగిసినట్లు కలకడ శాఖ గ్రంథాలయ అధికారి అమరనాథ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 56వ గ్రంథాల వారోత్సవాలలో భాగంగా గత వారం రోజులగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాలైన పోటీలు క్విజ్‌, వ్యాసర రచన, వకృత్వ, ముగ్గుల పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ పోటీలలో గెలుపొందిన సుమారు 40 మందికి స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (తెలుగు) నందు బహుమతులు ధ్రువీకరణ పత్రాలును పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశం స్థానిక ఎంఈఓ మునీంద్రనాయక్‌, ప్రధానోపాధ్యాయురాలు సరస్వతిల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వెళ్లేలా అలవాటు చేసుకోవాలని, గ్రంథాలయం ద్వారా జ్ఞానం పెరుగుతుందని తెలియ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.