మాంట్రియల్: భారత్తో తాము సన్నిహిత సంబంధాల్ని కలిగి ఉంటాం. కానీ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటున్నట్లు కెనడా ప్రధాని ట్రూడో అన్నారు. ఆయన గురువారం మాంట్రియల్లలో నిర్వహించిన మీడియా సమావేవంలో మాట్లాడుతూ.. 'గ్లోబల్ స్థాయిలో భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యతను చూస్తున్నాం. ఈ సమయంలో కెనడా, దాని మిత్రపక్షాలు భారత్తో సంబంధాలు మరింత మెరుగుపర్చుకోవాలనే తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. భౌగోళిక రాజకీయంలో కీలక పాత్ర పోషిస్తోంది. గతేడాది మేము ఇండో - పసిఫిక్ వ్యూహాన్ని అందించాం. మేము ఇప్పటికీ భారత్తో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకోవడానికి కట్టుబడి ఉన్నాం.' అని అన్నారు. ఇక అదే సమయంలో నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న తన వ్యాఖ్యలకు కట్టుబి ఉన్నట్లు ఈ సందర్భంగా టూడ్రో చెప్పారు. నిజ్జర్ హత్యలో చట్టాలను అనుసరించే దేశాలు తీవ్రంగా పరిగణించాలని టూడ్రో వ్యాఖ్యానించారు. నిజ్జర్ హత్యపై అమెరికన్లు తమతోనే ఉన్నారని టూడ్రో వ్యాఖ్యానించారు. భారత విదేశాంగ మంత్రితో భేటీ సమయంలో ఈ విషయాన్ని లేవనెత్తుతానని అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తనకు హామీచ్చినట్లు టూట్రో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్య దేశాలు సీరియస్గా తీసుకోవాలని ట్రూడో పిలుపునిచ్చారు.
''కెనడా, దాని మిత్రదేశాలు భారత్తో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ, అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా.. నిజ్జర్ హత్య విషయంలో మాతో కలిసి భారత్ పనిచేసి అసలు వాస్తవాల్ని వెలికితీయాలి. కెనడియన్ను మా గడ్డపై హత్య చేయడంలో భారత ఏజెంట్ల పాత్ర నిర్ధారించే విషయంలో అమెరికా మాతోనే ఉంది'' అని పేర్కొన్నారు.