
శ్మశానాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ మేయర్ శ్రీధర్
ప్రజాశక్తి-కరాస: జివిఎంసి 52వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ సోమవారం పరిశీలించారు. వార్డులోని కరాస హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశాన వాటిక, పలు పార్కులలో చేస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఉడా లే-అవుట్ గ్రీన్ బెల్ట్లో వాకింగ్ ట్రాక్ పునరుద్ధరణపై అధికారులతో చర్చించారు. నిర్మాణ పనుల నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఇ ఏడుకొండలు, ఎఇ ఉష, వార్డు సచివాలయ సెక్రటరీలు, పారిశుధ్య విభాగం ఇన్స్పెక్టర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.