Aug 08,2021 11:50

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గతంలో 40 వేల కేసులు నమోదు అవుతుండగా.. గత రెండు రోజుల నుండి తగ్గుతున్నాయి. ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 17, 22, 221 పరీక్షలు చేపట్టగా 39,070 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో 3.19 కోట్లకు పైగా కేసులున్నాయి. తాజాగా 491 మంది మరణించడంతో ... ఇప్పటి వరకు మహమ్మారి కారణంగా 4,27,862 మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 4,06,822కు తగ్గాయి. రికవరీ రేటు 1.29 శాతంగా ఉంది. ప్రస్తుతం కోలుకున్న వారి శాతం 97.37 శాతంగా ఉంది. ఆగస్టు 4 వరకు దేశంలో మొత్తం 83 డెల్టా కేసులు వెలుగుచూశాయి. అదేవిధంగా ఇప్పటి వరకు 50.68 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ అయ్యాయి. కేరళలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి.