
ప్రజాశక్తి- కంచరపాలెం : జివిఎంసి 48వ వార్డులోని జైభారత్నగర్ సచివాలయ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు సోమవారం శంకుస్థాపన చేశారు. రూ.20 లక్షలతో బిటి రోడ్లు, ఇందిరానగర్ -2, 3 ప్రాంతాల్లో రూ.20 లక్షలతో మెట్లు, కాలువలు, వీధి రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసిపి ఇన్ఛార్జి నీలి రవి, కార్పొరేటర్ జి.కవిత అప్పారావు, డిఇ భరణికుమార్, ఎఇ అర్చన, కర్రి రామిరెడ్డి, శ్రీరామ్, హేమంత్, భూలోక, పి.అప్పారావు, డొప్ప శ్రీను, కనకమహేష్, జూన్సన్, జాగరపు అప్పారావు, భరత్ అప్పారావు, దుర్గాభవాని, జయంతి, వరలక్ష్మి, ప్రసాద్, భాస్కర్, రాజేష్, లోకేష్, నరేష్ సచివాలయ కన్వీనర్లు పాల్గొన్నారు.
47వ వార్డులో ఇళ్ల పట్టాలు పంపిణీ
జివిఎంసి 47వ వార్డు పరిధి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి ఆధ్వర్యాన రాంజీ ఎస్టేట్ సామజిక భవనంలో సోమవారం ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వసంతల అప్పారావు, రాఘవులు, సుకుమార్, కోరిబిల్లి విజరు, చందు, అనీల్, మొక్క రమణ, గురువోజి, వాసు సురేష్, నాగరాజు, రమేష్, భారత్, జయకుమార్, తదితరులు పాల్గొన్నారు.