Jul 29,2021 07:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉన్నత పాఠశాలలకు 250 మీటర్లలోపు దూరంలో ఉన్న 3,627 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థులను తరలించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనరు చినవీరభద్రుడు ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖ అధికారులతో మంగళ, బుధవారాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి మ్యాపింగ్‌ చేయాలని ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2021-22 విద్యాసంవత్సరం నుంచి తరగతుల విభజన ప్రారంభం కానుంది.