
కర్నూల్: శిశువు గర్భాశయంలోనే ఎదగకపోవడం వల్ల ఊపిరితిత్తుల్లో రక్తస్రావమవడంతోపాటుగా శ్వాసకోశ వ్యాధిన భారిన పడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూల్ లోని మెడికవేర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు శిశువుకి వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిని నయం చేశారు. వివరాల్లోకి వెళితే ..'డెలివరి తర్వాత శిశువుకు కడుపు ఉబ్బరం , బిలియరీ ఆస్పిరేట్స్ అభివృద్ధి చెందాయి. దీంతో క్రమంగా శిశువు పరిస్థితి క్షీణించింది. తదుపరి చికిత్స కోసం వైద్యశాలకు ఉదయం 4.36 గంటలకు తీసుకువచ్చారు. శిశువు అడ్మిసియన్ సమయంలో 2 .5 సంఖ్య పైపు నోటిద్వారా ఊపితిత్తులలోకి వేశారు. నాడి సరిగ్గా కొట్టుకోవడం లేనందున నోటి నుండి ముక్కులో నుండి రక్త స్రావమైంది. వెంటనే చిన్న పిల్లలకి తీసుకువెళ్లి వెంటిలేటర్పై ఉంచి చికిత్సను అందించాం. ఆతర్వాత శిశువుకు ఎక్స్ రే తీయించగా న్యూమోథొరాక్స్ కుడి వైపున ఉంది. దీనిని గుర్తించి శిశువు బరువు ప్రకారం ట్యూబ్ ఫీడింగ్ ప్రారంభించాము. ప్రతి 4 గంటలకోసారి నెబ్యులైజేషన్ ఇచ్చారు, శిశువుకు సరైన నర్సింగ్ కేర్ అందించారు. శరీర బరువును బట్టి ఫీడ్ పెరిగింది. తల్లి పాలు క్రమంగా ప్రారంభించడం జరిగింది. బేబీ క్రమంగా 1.87 కిలోలతో ఆరోగ్యకరంగా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.' అని వైద్యులు తెలిపారు. బాబు కు సరైన వైద్యం సరైన సమయంలో అందించినందుకు పిల్లల వైద్య నిపుణురాలు డా.సింధూరకు శిశువు తల్లిదండ్రులు దన్యవాదాలు తెలిపారు.