
పట్టుబడ్డ గంజాయితో నిందితుడు
ప్రజాశక్తి-పెందుర్తి : పెందుర్తిలో 130 కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పాడేరు నుంచి ఫేక్ నెంబర్తో ఉన్న కారులో 130 కిలోల గంజాయిని కేరళకు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది పెందుర్తిలో మాటువేసి పట్టుకున్నారు. కేరళకు చెందిన శశి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయితోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పెందుర్తి పోలీస్స్టేషన్కు అప్పగించారు.