Jan 02,2023 23:41

యూత్‌ ఫెస్టివల్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న 'విజ్ఞాన్‌' ఉద్యోగులు, విద్యార్థులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : విజ్ఞాన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ ఫర్‌ విమెన్‌, ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ సంయుక్తంగా యువతరంగ్‌ 2023 పేరుతో ఈ నెల 11, 12 తేదీలలో నేషనల్‌ లెవెల్‌ యూత్‌ ఫెస్టీవల్‌ నిర్వహించుటకు నిర్ణయించినట్లు కళాశాల రెక్టర్‌ డాక్టర్‌ వి మధుసూదనరావు తెలిపారు. సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఏటా 10 వేల మంది విద్యార్థులు వివిధ రాష్టాలనుంచి పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు డాన్స్‌, పోయెట్రీ, మెహేంది, పలు క్రీడలు, పెయింటింగ్‌, మైక్రో ఆర్ట్‌, కాఫ్ట్స్‌, నైల్‌ ఆర్ట్‌, షార్ట్‌ ఫిలిం డ్రామా, స్కిట్‌, మైమ్‌ ఫ్లాష్‌ మాబ్‌, ఫోటోగ్రఫీ, దుబ్‌ స్మాష్‌ రాక్‌ బ్యాండ్‌ తదితర పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రూ.5 లక్షల వరకు బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. అనంతరం యువతరంగ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్‌ వైజాగ్‌ గ్రూప్‌ సిఇఒ ఎన్‌.శ్రీకాంత్‌, విఐపిటి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, విఐఐటి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.అరుంధతి, విఐఇడబ్ల్యు డాక్టర్‌ జ్‌.సుధాకర్‌, యువతరంగ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ బి. సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.