
ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 10వ వార్డులో కార్పొరేటర్ మద్దిల రామలక్ష్మి ఆధ్వర్యాన ఆదివారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టారు. వివేకానందనగర్, ఆదర్శనగర్, నాగేశ్వరరావుపేట ప్రాంతాల్లో ఇంటింటికీ స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కార్పొరేటర్, టిడిపి నాయకులు వెళ్లి సమస్యలనడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను, పెరిగిన ధరలు, బస్సు ఛార్జీలు తదితరాలను స్థానికులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వార్డు కార్పొరేటర్ మద్దిల రామలక్ష్మి మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మద్దిల రాజశేఖర్, ఒమ్మి అప్పలరాజు, బుడుమూరు గోవిందు, పోలారావు, గాడు అప్పలనాయుడు, కేత సత్యనారాయణ, ముగడ రాజారావు తదితరలు పాల్గొన్నారు.