Nov 19,2023 22:38

ప్రజాశక్తి-అవనిగడ్డ : దివిసీమలో 1977 నవంబర్‌ 19న సంభవించిన ఉప్పెన జలప్రళయంలో అసువులు బాసిన వేలాదిమంది మృతులను స్మరించుకుంటూ పలు రాజకీయ పార్టీలు వారికి ఘన నివాళులర్పించారు. ఆదివారం మండల పరిధిలోని పులిగడ్డ వద్ద ఉప్పెన మతుల కోసం నిర్మించిన పైలాను వద్ద మృతులకు నివా ళులర్పించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు ప్రజాప్రతినిధులు వైసిపి నాయకులు పైలాన్‌ వద్దకు వెళ్లి అక్కడ కొవ్వొత్తులు వెలిగించి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కోకిలగడ్డ వీర వెంకటేశ్వరరావు, ఎంపీపీ తుంగల సుమతి దేవి, జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ, పులిగడ్డ అవనిగడ్డ సర్పంచులు దాసరి విజరు కుమార్‌, గోరుముచ్చు ఉమా, పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్‌ రేపల్లె శ్రీనివాసరావు పాల్గొన్నారు. అదేవిధంగా తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పైలాన్‌ వద్ద మతులకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకష్ణ టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్‌ రామ్‌, జనసేన సీనియర్‌ నాయకులు బచ్చు వెంకట్‌ నాద,¸్‌ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషు బాబు, టిడిపి నాయకులు బం డే రాఘవ, బాదర్ల లో లక్ష నాయుడు, టిడిపి జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు