Sep 05,2023 20:51
  • శ్రీశైలం ఇఓగా పెద్దిరాజు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా 35మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జీఓ ఆర్‌టి నెంబరు 1777ని మంగళవారం విడుదల చేసింది. శ్రీశైల భ్రమరాంభికా మల్లికార్జునస్వామి దేవస్థానం ఇఓగా పనిచేస్తున్న లవన్నను గుంతకల్లు ఆర్‌డిఓగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో కడపలో టిఆర్‌అండ్‌బిలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న పెద్దిరాజును శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయ ఇఓగా నియమించారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్ధానం ఇఓగా డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్‌.శ్రీనివాసమూర్తిని నియమించారు. వీరితో పాటు మిగిలిన 32మందిని ఆర్‌డిఓలుగా, పలు శాఖలకు ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీలు అయిన వారిని సిఎం విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రిలీవ్‌ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.