Sep 09,2023 09:59
  • చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గం
  •  సీఎం జగన్‌ అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారు

ప్రజాశక్తి-అనంతపురం : ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష సాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యం అని హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ''నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్‌ కక్ష సాధిస్తున్నారు.. టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఆయన తీవ్రంగా ఖండించారు.'' ఈ విషయంపై బాలకష్ణ మాట్లాడుతూ.. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్‌ చేశారని ప్రశ్నించారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇది కావాలని రాజకీయ కక్షతో చేస్తున్న కుట్ర. 19.12.2021లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జ్‌ సీటు చేయలేదు..? డిజైన్‌ టెక్‌ సంస్ధ అకౌంట్‌ లు ప్రీజ్‌ చేసి నిధులు స్తంభింబచేసినపుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబందించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అన్నారు. 2.13 లక్షల విద్యార్దులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హై కోర్టు చెప్పలేదా అన్నారు. మళ్లీ తప్పల మీద తప్పుల చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారు. జగన్‌ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్‌ చేశారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు, దీనిపై న్యాయపోరాటం చేస్తాం..ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం అన్నారు.