Nov 09,2023 21:18

పూణె : ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఎల్‌) భాగస్వామ్యం కుదర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు సంస్థలు సంయుక్తంగా భారత్‌లో విమానాల మెయింటనెన్స్‌, రిపేర్‌ అండ్‌ ఓవరాల్‌ (ఎంఆర్‌ఒ) సర్వీసింగ్‌ సేవలను అందించనున్నాయి. భారత విమానయాన రంగంలో ఎంఆర్‌ఒ పరిశ్రమ వృద్థికి మద్దతు లభించనుంది. హెచ్‌ఎల్‌ విజన్‌లో భాగంగా ఎంఆర్‌ఒ హబ్‌ను ఏర్పాటు చేయనుందని.. ఇందుకోసం తమ నాసిక్‌ సంస్థ కృషి చేయనుందని హెచ్‌ఎల్‌ సిఇఒ సాకేత్‌ చతుర్వేది పేర్కొన్నారు. భారత్‌లో విమానయాన రంగం పెరుగుతున్న నేపథ్యంలో బలమైన ఎంఆర్‌ఒ కేంద్రాలు అవసరమని ఎయిర్‌బస్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ఎండి రెమి మిలార్డ్‌ అన్నారు.